Thursday, April 25, 2024

తెలంగాణ‌లో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ద‌వాఖాన‌ల‌కు మందుల పంపిణీకి ప్ర‌త్యేక క‌మిటీ

తెలంగాణలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ద‌వాఖాన‌ల‌కు మందు పంపిణీ చేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక క‌మిటీని నియ‌మించింది. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ (నిమ్స్‌) డైరెక్ట‌ర్ మ‌నోహ‌ర్‌, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేష్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కుడు జీ శ్రీనివాస రావుకు ఈ క‌మిటీలో చోటు క‌ల్పించింది. కొవిడ్ నేప‌థ్యంలో మందు పంపిణీపై నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ ఉంచేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. ఇందులో భాగంగా మందుల పంపిణీని ఎప్ప‌టిక‌ప్ప‌డు ప‌రిశీలించేందుకు ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement