Friday, May 3, 2024

ఐజేయూ సదస్సుకు ముఖ్య అతిథిగా కేసీఆర్.. సీఎంను కలిసిన తెలంగాణ జర్నలిస్టుల సంఘం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధమని, రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో  తెలంగాణ జర్నలిస్టుల కృషిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ  జర్నలిస్టులకోసం వంద కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మీడియా అకాడెమీ ద్వారా  జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటూ వస్తున్నదనన్నారు. అక్రిడేషన్లు సహా జర్నలిస్టులకు అందాల్సిన అన్ని  ప్రత్యేక సౌకర్యాలను అందిస్తున్నదని,  ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందనీ సీఎం కేసిఆర్ అన్నారు.

భారత రాష్ట్ర సమితి ఏర్పాటు సందర్భంగా అభినందనలు, తమ సంఘీభావం  తెలిపేందుకు ఢిల్లీ కి వచ్చిన  అల్లం నారాయణ ఇతర జర్నలిస్టు నేతలతో సీఎం కేసిఆర్ రెండోరోజు శుక్రవారం మరోసారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా జర్నలిస్టు నేతలు పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెల్లారు. పలు జర్నలిస్టు సమస్యలపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన సీఎం కేసిఆర్,  ఇంకా ఏవైనా సమస్యలుంటే పరిస్థితులను బట్టి  చర్చించి పరిష్కరించుకుందామన్నారు.

- Advertisement -

తెలంగాణ జర్నలిస్టుల సంఘం (టి యు డబ్ల్యు జె) ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయు) జాతీయ సదస్సు కు ముఖ్య అతిథిగా సీఎం కేసిఆర్ ను ఆహ్వానించగా సీఎం కేసిఆర్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టు విషయాలపై  సమన్వయం చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ను సీఎం కేసిర్  అదేశించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణతో పాటు, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, టియుడబ్లుజె ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, అవ్వారి భాస్కర్ తదితరులున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement