Monday, May 6, 2024

తెలంగాణలో నిలకడగా కరోనా కేసులు

తెలంగాణలో రోజువారి కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 417 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అదే సమయంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇక నిన్న కరోనా నుంచి 500 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ కేసులు సంఖ్య 6,53,202కు పెరిగాయి. ఇవాళ్టివరకు మొత్తం 6,42,413 మంది కోలుకున్నారు. ఇంకా 6,939 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 3847 మంది మృతి చెందారు. ఇవాళ 87,230 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: పాక్ లో మహారాజా రంజిత్ విగ్రహం ధ్వంసం

Advertisement

తాజా వార్తలు

Advertisement