Sunday, April 28, 2024

టీమిండియా కోచ్ రవిశాస్త్రితో పాటు మరో ఇద్దరికి కరోనా

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి ఆదివారం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయనకు ఆర్టీపీసీఆర్ టెస్టు కూడా నిర్వహించారు. తాజాగా ఆర్టీపీసీఆర్ టెస్టు ఫలితం వచ్చింది. ఆందులోనూ రవిశాస్త్రికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ లకు కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా, వారిద్దరూ కరోనా పాజిటివ్‌గా తేలారు. దాంతో ఈ ముగ్గురు చివరి టెస్టుకు వేదికైన మాంచెస్టర్‌కు వెళ్లబోవడంలేదని మేనేజ్ మెంట్ వర్గాలు తెలిపాయి. వారు లండన్‌లోనే మరో 10 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు మాంచెస్టర్ వేదికగా ఈ నెల 10న ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement