Friday, April 26, 2024

విద్యార్థుల‌ను ఇనుప గొలుసుల‌తో క‌ట్టి – తాళం వేసిన ఉపాధ్యాయుడు

ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ఇనుప‌గొలుసుల‌తో క‌ట్టేశాడు ఓ ఉపాధ్యాయుడు. వార‌ద్ద‌రిని చిత్ర హింస‌ల‌కు గురి చేశాడు. ఇనుప గొలుసులతో కట్టిపడేసి, దానికి తాళం వేశాడు. వారు అక్కడి నుంచి తప్పించుకొని స్థానికులకు తెలియజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవద్దని ఆ పిల్ల‌ల‌ తల్లిదండ్రులు పోలీసులను కోరడం ఇక్కడ కొసమెరుపు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో స‌మీపంలో ఉన్న మ‌ద‌ర్సాలో ఈ దారుణం వెలుగులోకి వ‌చ్చింది. మదర్సాలోని మౌలానా ఇద్దరు పిల్ల‌ల‌ను ఇనుప గొలుసుల‌తో క‌ట్టేశాడు. దానికి తాళం వేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మార‌డంతో ఈ ఘ‌ట‌న బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఈ ఘ‌ట‌న‌పై త‌ల్లిదండ్రులు పోలీసుకు ఫిర్యాదు చేయ‌లేదు. పైగా ఆ మౌలానాపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకూడ‌ద‌ని లిఖిత‌పూర్వ‌కంగా రాసి ఇచ్చారు ..గోసైంగంజ్ శివలార్‌లో ఉన్న సుఫమ్‌దింతుల్ ఉలమా మదర్సాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అక్క‌డికి చ‌దువుకునేందుకు వ‌చ్చిన ఇద్ద‌రు విద్యార్థుల పాదాలకు ఇనుప గొలుసులు క‌ట్టారు. అయితే వారిద్ద‌రు మదర్సా నుంచి ఎలాగోలా త‌ప్పించుకొని వారి గ్రామానికి చేరుకున్నారు. పిల్లల కాళ్లకు గొలుసులు పడి ఉండడం చూసి గ్రామస్తులు వారిని ఆపారు. మదర్సా ఉపాధ్యాయులు తమను బెత్తంతో కొట్టారని, కాళ్లను గొలుసుతో క‌ట్టేశార‌ని విద్యార్థులు ఆరోపించారు. అమాయకుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరుపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ కూడా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement