Thursday, April 18, 2024

హ్యుందారు వెన్యూ కొత్త మైలురాయి..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : దేశంలో తొలి స్మార్ట్‌ మొబిలిటీ పరిష్కారాల కర్త, అతిపెద్ద ఎగుమతిదారు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ తమ ఎస్‌ యూవీ వెన్యూ అత్యద్భుత విజయం సాధించిందని ప్రకటించింది. 2019లో భారత్‌లో ఆవిష్కరించినప్పటి నుంచి మూడు లక్షల యూనిట్ల అమ్మకాలతో వెన్యూ కొత్త మైలురాయి సృష్టించిందని సంస్థ తెలియజేసింది. హ్యుందాయ్‌ వెన్యూ విజయం తమ హైటెక్‌, ఫీచర్లతో కూడిన ఉత్పత్తుల పట్ల కస్టమర్ల ప్రేమకు నిదర్శనమని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ డైరెక్టర్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌, సర్వీస్‌) తరుణ్‌ గార్గ్‌ పేర్కొన్నారు.

వెన్యూ బలమైన అమ్మకాల ప్రదర్శన ద్వారా హ్యుందాయ్‌ గత రెండు సంవత్సరాల్లో దేశంలో నంబర్‌ వన్‌ ఎస్‌ యూవీ తయారీ సంస్థగా నిలచింది. వెన్యూ అమ్మకాల్లో 70 శాతం పైగా పెట్రోల్‌ ఇంజన్ల మోడళ్లే కావడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement