Sunday, April 28, 2024

హోదా అంటే జగన్ ను వణుకు!

ప్రత్యేక హోదా పేరు ఎత్తాలంటే జగన్ వణికిపోతున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. వైసీపీకి చెందిన 28 మంది ఎంపీలను హోదా కోసం కాకుండా కేసుల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఏనాడైన గట్టిగా మాట్లాడారా అని ప్రశ్నించారు. జగన్‌ను జైలులో పెడతారనే భయంతోనే.. వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాట్లాడలేక పోతున్నారన్నారని విమర్శించారు. కేసుల నుంచి ఎలా బయటపడాలనేదే జగన్‌ ఆలోచన అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో పోరాటం చేస్తామన్నారు.

తిరుపతి ప్రజలు టీడీపీకి గెలిపించాలని సిద్ధంగా ఉన్నారని.. వైఎస్సార్‌సీపీని గెలిపిస్తే ఏడు కొండలను అమ్మేస్తారన్నారు. చంద్రబాబు హయాంలోనే తిరుపతిలో అభివృద్ధి జరిగిందని.. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా అని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement