Friday, April 26, 2024

వైఎస్ షర్మిల కాన్వాయ్‌లో ప్రమాదం

ఈ సాయంత్రం ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం నుంచి ర్యాలీగా వైఎస్ షర్మిల ఖమ్మం బయలుదేరారు. అయితే వైఎస్ షర్మిల కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు వాహనాలు ఢీకొని పలువురికి గాయాలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు షర్మిల ఖమ్మం చేరుకోవాల్సి ఉంది.

ఇవాళ జరిగే సంకల్ప సభలో షర్మిలతో పాటు తల్లి విజయమ్మ కూడా ఈ సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఖమ్మం సభను అభిమానులు భారీగా ఏర్పాటు చేశారు. సాయంత్రం జరగనున్న సభలో కొత్త పార్టీ పేరుతో పాటు జెండాను షర్మిల ఆవిష్కరించే అవకాశముంది. ఈ సభకు ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలోని మిగతా జిల్లాల నుంచి భారీగా వైఎస్‌ అభిమానులు తరలివస్తున్నారు. సంకల్పయాత్రకు బయల్దేరే ముందు షర్మిల ఆమె భర్త అనిల్ ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు అన్నివిధాలా తోడ్పాటునందిస్తున్నందుకు ఆమె అనిల్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

https://twitter.com/blessedanil/status/1380371044796493824
Advertisement

తాజా వార్తలు

Advertisement