Saturday, May 18, 2024

ఏపీలో ప‌రిణామాల‌పై ఈడీకి టీడీపీ ఫిర్యాదు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగిన ప‌రిణామాల‌పై తెలుగుదేశం పార్టీ నేత‌లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కి ఫిర్యాదు చేశారు. గుడివాడ క్యాసినో వ్య‌వ‌హారంపై ఢిల్లీలో ఈడీకి టీడీపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. ఈడీని క‌లిసిన వారిలో టీడీపీ నేత‌లు రామ్మోహ‌న్ నాయుడు, రాజేంద్ర ప్ర‌సాద్ ఉన్నారు. రూ.500కోట్లు చేతులు మారిన‌ట్లు నేత‌లు వివ‌రించారు. లావాదేవీల‌పై మ‌నీలాండ‌రింగ్ ద‌ర్యాప్తు చేయాల‌ని నేత‌లు కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement