Tuesday, May 21, 2024

లైఫ్ జాకెట్..బోటు ప్ర‌యాణం..వ‌ర‌ద బాధితుల కోసం చంద్ర‌బాబు ప‌య‌నం

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు. గురు, శుక్ర‌వారాల్లో చంద్ర‌బాబు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గురువారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప‌రిధిలోని అయోధ్య లంక‌కు చంద్ర‌బాబు చేరుకున్నారు. గోదావ‌రిలో వ‌ర‌ద ఉధృతి త‌గ్గినా… గ్రామాల్లోని వ‌ర‌ద నీరు ఇంకా పూర్తిగా తొల‌గిపోలేదు. ఈ క్ర‌మంలో ఆయా ప్రాంతాల్లో ప‌ర్య‌టించాలంటే.. బోటును త‌ప్ప‌నిస‌రిగా వినియోగించాల్సిందే. ప‌రిస్థితికి త‌గ్గట్టుగా స్పందించిన చంద్ర‌బాబు… లైఫ్ జాకెట్ తొడుక్కుని బోటులోనే వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు బ‌య‌లుదేరారు. ఈ వీడియోను టీడీపీ త‌న సోష‌ల్ మీడియా ఖాతాల వేదిక‌గా పంచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement