Wednesday, May 1, 2024

చెప్పులతో పోలుస్తారా..? :సీఎం పళనిస్వామి ఆవేదన

డీఎంకే అధినేత స్టాలిన్ చెప్పులతో పోల్చుతూ పళనిపై సీనియర్ నేత ఏ.రాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్టాలిన్ ధరించే చెప్పులు పళనిస్వామి కంటే ఒక రూపాయి ఎక్కువ విలువైనవని దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. పళనిస్వామి ఏ. రాజా పైవిరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలు చాలా బాధించాయని చెప్పారు. ఇలాంటి అసభ్యకరమైన భాషను వాడటం దారుణమని అన్నారు. తాను ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేద్దామనుకుంటున్నానని… చుట్టూ మహిళలు ఉన్నారని… ఇంతకు మించి తాను ఏమీ మాట్లాడలేనని చెప్పారు. ఇలాంటి వారిని దేవుడే శిక్షిస్తాడని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement