Saturday, May 4, 2024

Tamilanadu – బాణసంచా గోడౌన్ లో భారీ పేలుడు – ఏడుగురు దుర్మ‌ర‌ణం

చెన్నై – తమిళనాడులోని బాణసంచా గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో గోడౌన్ సిబ్బంది ఏడుగురు చనిపోయారు. మ‌రో 20 మంది గాయ‌ప‌డ్డారు. పేలుడు ధాటికి గోడౌన్ బిల్డింగ్ సహా చుట్టుపక్కల మరో ఐదు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

వివ‌రాల‌లోకి వెళితే కృష్ణగిరి పాతపేటలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీ గోడౌన్ లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్ కు నిప్పంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఏడుగురు చనిపోగా మరో 20 మంది గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించామని, బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం వెతుకుతున్నామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement