Monday, April 29, 2024

ములుగు పోలీస్ స్టేషన్ కు మంత్రులు హరీశ్, మహమూద్ అలీ శంకుస్థాపన

గజ్వేల్: సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగులో పోలీసు స్టేషను, అలాగే వర్గల్ మండలం గౌరారంలో సర్కిల్ పోలీసు స్టేషను భవన నిర్మాణ పనులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి రాష్ట్ర మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సిద్ధిపేట పోలీసు కమిషనర్ శ్వేత, అడిషనల్ డీసీపీ మహేందర్, పోలీసు శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement