Monday, May 6, 2024

ఆరుగురు కలిసి గ్యాంగ్​రేప్​ చేసి, మహిళను చంపేశారు.. రామేశ్వరంలో దారుణం

తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో ఘోరం జరిగింది. 45ఏళ్ల మత్స్యకార మహిళపై ఆరుగురు దుండగులు గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. మొన్నటి  మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ కేసును సవాల్​గా తీసుకున్న పోలీసులు నిందితులకోసం వెతుకుతున్నారు. దర్యాప్తులో వేగం పెంచిన వారికి అక్కడి రొయ్యల ఫారంలో పనిచేసే ఒడిశాకు చెందిన వారే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. రొయ్యల ఫారమ్​లో మంగళవారం పనికి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి రాలేదని ఆమె కుటుంబ సభ్యులుఎంత వెతికినా కనిపించలేదు. దీంతో పోలీసులకు కంప్లెయింట్​ చేశారు.

కాగా, మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడడమే కాకుండా, ఆమెను చంపేశారు. అంతేకాకుండా ఎవరూ గుర్తుపట్టకుండా ఆమె ముఖాన్ని కాల్చివేశారు. దీన్ని ఆ ప్రాంత మహిళలు తీవ్రంగా పరిగణించారు. ఆ మహిళ కుటుంబం అనుమానిస్తున్న ఒడిశాకు చెందిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పటివరకు మృతదేహాన్ని తీసుకువెళ్లబోమని ఆసుపత్రి బయట నిరసనకు దిగారు. కోపోద్రిక్తులైన ప్రజలు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకునేలోపే వారిపై దాడి చేసి చితకబాదారు. రామేశ్వరం నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement