Saturday, April 27, 2024

వన్‌టైమ్‌ స్కీంను సద్వినియోగం చేసుకోండి .. అక్టోబర్‌ 31లోపుచెల్లిస్తే 90శాతం వడ్డీ మాఫీ

హైదరాబాద్‌ ప్రతినిధి ప్రభ న్యూస్‌: పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలను త్వరతిగతిన రాబట్టేందుకు ప్రవేశపెట్టిన వన్‌టైమ్‌ స్కీమ్‌ (ఓటీఎస్‌) పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ నగరవాసులకు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 2021-22 సంవత్సరానికి పేరుకుపోయిన

బకాయిలను అక్టోబర్‌ 31లోపు ఒకేసారీ చెల్లిస్తే 90శాతం వడ్డీ మాఫీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే నగరప్రజలు తమ ఇళ్లకు సంబంధించి ప్రాపర్టీ టాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌ (పీటీఐఎన్‌) అప్‌డేట్‌ చేసుకోని వారు వెంటనే చేసుకోవాలని సూచించారు. సర్కార్‌ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిపోందాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement