Tuesday, May 7, 2024

Breaking: ఫిలింనగర్ లో వ్యక్తి అనుమానాస్పద మృతి..

హైదరాబాద్ న‌గ‌రంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ప‌రిధి ఫిలిం నగర్ లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. మహాత్మా గాంధీ నగర్ బస్తీలో భవనం మీద నుంచి కింద పడిన రామస్వామి అనే వ్యక్తి మృతిచెందారు. భార్యతో మద్యం మత్తులో గోడవ ప‌డి కింద పడ్డాడా ? లేక భార్య తోసేయడంతో కింద పడ్డాడా ? అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీ తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement