Monday, May 6, 2024

ఆప‌ని చేస్తోంద‌న్న అనుమానం.. భార్య గొంతు కోశాడు..

ల‌క్నో: వివాహేత‌ర సంబంధం ఉంద‌నే అనుమానంతో క‌ట్టుకున్న భార్య‌ను గొంతుకోసి హ‌త‌మార్చాడు ఓ కిరాత‌క భ‌ర్త‌. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ట్రం ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ ఓ టైల్స్ ప‌రిశ్ర‌మంలో దిన‌స‌రి కూలీలుగా ప‌నిచేస్తున్నారు. ఆ ప‌రిశ్ర‌మలో ప‌నిచేసే మ‌రొక కార్మికుడితో ఆమె అక్ర‌మ సంబంధం పెట్టుకుంద‌ని భ‌ర్త అనుమానిస్తూ వ‌స్తున్నాడు.

ఈ విష‌యంతో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌రుచూ గొడ‌వ‌లు కూడా జ‌రుగుతున్నాయి. నిన్న ఫ్యాక్ట‌రీ నుంచి ఇంటికొచ్చిన త‌ర్వాత మ‌రోమారు భార్యాభ‌ర్త‌లు ఘ‌ర్ష‌ణ ప‌డ్డారు. రాత్రి భోజ‌నం చేసి నిద్ర‌పోయారు. అర్ధ‌రాత్రి ఆ కిరాత‌కుడు లేచి, ప‌దునైన క‌త్తితో దాడి చేసి గొంతు కోసేశాడు. ఆమె అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. భ‌ర్త క‌త్తితో దాడి చేసిన స‌మ‌యంలో గ‌ట్టిన కేక‌లు వేయ‌డంతో ఇరుగుపొరుగు వారు అక్క‌డికి పోగ‌య్యారు. నిందితుడిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement