Sunday, May 19, 2024

ఇంగ్లండ్ బయలుదేరిన సూర్యకుమార్ యాదవ్

భారత యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్‌లో ఉన్న ఇండియ‌న్ టెస్ట్ టీమ్‌తో చేర‌డానికి బ‌య‌లుదేరాడు. ఈ విష‌యాన్ని అత‌డే త‌న ట్విట‌ర్ ద్వారా వెల్లడించాడు. ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కుతున్న ఫొటోను అత‌డు పోస్ట్ చేస్తూ.. నెక్ట్స్ స్టాప్ ఇంగ్లండ్ అని కామెంట్ చేశాడు. ఇంగ్లండ్‌లో ఉన్న టెస్ట్ టీమ్‌లో శుభ్‌మ‌న్ గిల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, అవేష్ ఖాన్ గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే.

దీంతో శ్రీలంక‌లో ఉన్న టీమ్ నుంచి సూర్య‌కుమార్ యాద‌వ్‌, పృథ్వీ షాను ఇంగ్లండ్ పంపాల్సిందిగా కెప్టెన్ కోహ్లి, కోచ్ ర‌విశాస్త్రి బోర్డును అడిగారు. దీంతో వాళ్లు అక్క‌డికి వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో కృనాల్ పాండ్యాకు కరోనా సోక‌డం, వీళ్లు అత‌నితో స‌న్నిహితంగా ఉండ‌టంతో ఐసోలేష‌న్‌లో ఉండాల్సి వ‌చ్చింది. దీంతో తొలి టెస్ట్ కంటే ముందే వీళ్లు అందుబాటులో ఉండాల్సి ఉన్నా.. ఇప్పుడు ఆల‌స్య‌మైంది. కాగా బుధ‌వారం నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే సూర్యకుమార్, పృథ్వీ షా మూడో టెస్ట్ స‌మ‌యానికి టీమ్ సెల‌క్ష‌న్‌కు అందుబాటులో ఉండ‌నున్నారు.

ఈ వార్త కూడా చదవండి: టీమిండియా బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్

Advertisement

తాజా వార్తలు

Advertisement