Friday, May 3, 2024

Breaking: తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. రేపు శ్రీవారి దర్శనం

తిరుమల వేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. శ్రీ కృష్ణ అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో న‌ర‌సింహ కిషోర్‌, ఇత‌ర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు సీజే వెంట తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ బుయన్ కూడా ఉన్నారు. శుక్ర‌వారం ఉదయం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement