Friday, May 17, 2024

Delhi | ప్రత్యేక హోదాకు మద్దతివ్వండి.. మల్లికార్జున ఖర్గేకు ఓబీసీ సంఘం విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌కు మద్దతివ్వాల్సిందిగా జ్యోతిబాపూలే ఆలిండియా ఓబీసీ సంఘం కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేసింది. అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడి ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు, పలు రాష్ట్రాల అధ్యక్షులు మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఓబీసీ కులగణను చేపట్టినట్టే, తెలంగాణలో కూడా కులగణన చేపట్టేలా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. విశాఖ ఉక్కు  కర్మాగారంపై పార్లమెంట్‌లో గళం విప్పాల్సిందిగా వారు ఖర్గేకు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్‌ను జ్యోతీబా పూలే ప్రజా భవన్‌గా మార్చడంపై ప్రసాద్ నాయుడు, ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement