Sunday, May 5, 2024

National : పెషావ‌ర్ లో ఆత్మ‌హుతి దాడి..ఇద్ద‌రు మృతి..

పాకిస్తాన్‌ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లోని బోర్డ్ జబార్ సమీపంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ పేలుడులో కనీసం ఇద్దరు మరణించినట్లుగా అదికారులు వెల్లడించారు. మ‌రో న‌లుగురు గాయ‌ప‌డ్డారు.

గాయపడిన వారిని సమీపంలోని లేడీ రీడింగ్ హాస్పిటల్‌కి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మోటార్ సైకిల్‌పై పేలుడు పదార్థాలు అమర్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. పేలుడు జరిగిన తీరును గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. పేలుడులో అనుమానిత బాంబర్ కూడా చనిపోయాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పెషావర్ పోలీస్ చీఫ్ కాషిఫ్ అబ్బాసీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement