Sunday, April 28, 2024

AP : ఇందిర‌మ్మ అభ‌యం యాప్ ప్రారంభించిన ష‌ర్మిల‌…

‘ఇందిరమ్మ అభయం’ పథకం యాప్‌ను ష‌ర్మిల‌ లాంచ్ చేశారు. విజ‌య‌వాడ అంధ్ర‌ర‌త్న భ‌వ‌న్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ యాప్ ను ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని పేద మహిళలకు ప్రతినెల రూ. 5 వేలు అందిస్తారు. యాప్ ప్రారంభోత్సవం సందర్భంగా అర్హులైన కొందరు మహిళల వివరాలను ష‌ర్మిల స్వ‌యంగా అందులో పొందుపర్చారు.

- Advertisement -

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పేదింటి మహిళలకు సాధికారత కల్పించేందుకే ‘ఇందిరమ్మ అభయం’ పథకం తీసుకొచ్చినట్టు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ. 5 వేలు అందిస్తామని తెలిపారు. పేద కుటుంబాలను ఆదుకొనేందుకే కాంగ్రెస్ ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement