Tuesday, May 14, 2024

వ‌రుస‌గా మూడోరోజు న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు వ‌రుస‌గా మూడోరోజు కూడా న‌ష్టాల‌బాట ప‌ట్టాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో పాటు, మరో ఆర్థిక సంక్షోభం రాబోతోందనే అంచనాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఈరోజు ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత కోలుకున్నాయి. అయితే వెంటనే మళ్లీ పతనమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు కోల్పోయి 52,693కి పడిపోయింది. నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 15,732 వద్ద స్థిరపడింది. భారతి ఎయిర్ టెల్ (1.63%), ఎన్టీపీసీ (1.61%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.42%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.19%), ఇన్ఫోసిస్ (1.13%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.12%), టెక్ మహీంద్రా (-2.08%), రిలయన్స్ (-1.33%), మారుతి (-1.32%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.23%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement