Friday, April 26, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత.. జనసేన నేతలు, కార్మికుల మధ్య వాగ్వాదం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద గురువారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నేతలు, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పవన్‌ కళ్యాణ్ వైఖరి తెలపాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. దీక్షా శిబిరానికి పవన్‌ కల్యాణ్‌ రావాలంటూ కార్మికులు డిమాండ్‌ చేశారు.

అయితే కార్మిక సంఘాల నేతలకు జనసేన నేతలు కౌంటర్ ఇచ్చారు.‘ పవన్‌ను గాజువాకలో ఓడించారు.. ఆయన ఎందుకొస్తారు’ అంటూ జనసేన నేతలు ఎదురుదాడికి దిగారు. దీంతో జనసేన, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా జనసేన పార్టీ నేతలు వెళ్లిపోవాలంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement