Thursday, April 25, 2024

నీటమునిగిన డబుల్ బెడ్రూం ఇళ్లు.. గ్రౌండ్ ఫ్లోర్ సగం వరకు నీరు..

యాదాద్రి భువనగిరి జిల్లాలో గత రాత్రి కురిసిన వర్షాలకు యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో వరద ఉధృతికి కొత్తగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు నీటమునిగాయి. ఎగువ నుంచి భారీగా వరదనీరు చేరుకోవడంతో డబుల్ బెడ్రూం ఇండ్ల గ్రౌండ్ ఫ్లోర్ సగం వరకు నీట మునిగింది. యాదగిరి పల్లి నుండి యాదగిరిగుట్ట వచ్చే రహదారిపై నీరు ప్రవహిస్తూ ఉండటంతో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక యాదగిరి గుట్ట మున్సిపాలిటీ లోని యాదగిరిపల్లి లో పలు కాలనీలలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు వర్షానికి కొట్టుకుపోవడంతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు.

ఇది కూడా చదవండి: వరద నీటిలో చిక్కుకున్న ఎమ్మెల్యే కారు

Advertisement

తాజా వార్తలు

Advertisement