గత ఐదు సంవత్సరాలుగా..స్టార్ హీరోయిన్ నయనతార..విగ్నేష్ శివన్ ప్రేమించుకుంటుండగా.. ఇదిగో పెళ్లి, అదిగో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే… వీరి వివాహంపై ఓ క్లారిటీ వచ్చింది. జూన్ 9వ తేదీన వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తమ పెళ్లి పత్రికను ప్రముఖులకు అందజేస్తోంది ఈ కొత్త జంట. ఇందులో భాగంగానే తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ను కలిసింది నయనతార జంట. తమ వివాహ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్టాలిన్ కచ్చితంగా హాజరు కావాలని ఈ సందర్భంగా వారు కోరారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement