Friday, May 17, 2024

ఎనిమిదేండ్ల బాలికపై హత్యాచారం!

మైన‌ర్ బాలికల‌పై హ‌త్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొంద‌రు పోలీసులకు ఫిర్యాదు చేస్తుండ‌గా.. కొన్ని ఆల‌స్యంగానైనా వెలుగులోకి వ‌స్తున్నాయి. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తీసుకొచ్చినా ఎక్క‌డోచోట మైన‌ర్ బాలిక‌ల నుంచి వృద్ధురాలి వ‌ర‌కు హత్యాచారాల‌కు గుర‌వుతూనే ఉన్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని ఆమేర్‌ ప్రాంతంలో ఎనిమిదేండ్ల బాలికను దుండగులు గొంతుకోసి చంపారు. శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన బాలిక.. ఆదివారం ఉదయం దడాబాదీ ప్రాంతంలో శవమై తేలింది. ఎవరూ లేని ప్రాంతంలో బాలిక మృతదేహం నగ్నంగా కనిపించిందని జైపూర్‌ అదనపు జీసీపీ సుమన్‌ చౌదరి తెలిపారు. బాలికపై అత్యాచారం చేసి చంపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించామని, నివేదిక వచ్చిన తర్వాత విషయాలు తెలుస్తాయని చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement