Friday, May 3, 2024

ఎంపి సిఎం రోడ్ షోలో అప‌శృతి – కూలిన వేదిక‌… పలువురికి గాయాలు

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ నిర్వహించిన రోడ్‌ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. వేదిక కూలడంతో పలువురు గాయపడ్డారు. రాష్ట్రంలోని నీముచ్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మానస పట్టణం లో సోమవారం సీఎం రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది ప్రజలు రోడ్‌ షోకు తరలివచ్చారు. కొందరు అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నిలబడని సీఎంకు స్వాగతం పలికారు. ఈ క్రమంలో వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని అధికారులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement