Sunday, April 28, 2024

జనవరి నుండి SSMB28 రెగ్యులర్‌ షూటింగ్‌.. ట్వీట్ చేసిన నిర్మాత

గ‌తంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ..దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అత‌డు’, ‘ఖ‌లేజాలో నటించారు. కాగా వీరి కాంబోలో మూడో చిత్రం తెరకెక్కనుంది. కాగా ఈ చిత్రం గురించి అప్ డేట్ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలోనే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ చిత్రం సెప్టెంబర్‌లో షూటింగ్ మొద‌లు పెట్టింది. ఫస్ట్‌ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. నాగవంశీ.. మేం సిద్ధమైయ్యాం. చాలా కాలంగా ఎదురు చూస్తున్న SSMB28 రెగ్యులర్‌ షూటింగ్‌ జనవరి నుండి నాన్‌ స్టాప్‌గా కొనసాగుతుంది.

థియేటర్‌లో బ్లాక్‌బస్టర్‌ చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్‌ చేశారు ఈ చిత్ర నిర్మాత‌. ఈ ట్వీట్‌తో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో మ‌హేష్‌కు జోడీగా హీరోయిన్ పూజా హెగ్డే న‌టిస్తుంది. హారిక అండ్ హాసినీ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్.చిన‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేష‌న్ థ‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement