Wednesday, May 1, 2024

మహేష్-త్రివిక్రమ్ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. హ్యాట్రిక్ షురూ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై అప్‌డేట్ వచ్చేసింది. మహేష్ కెరీర్‌లో 28వ సినిమాగా ఇది అభిమానులను అలరించనుంది. మహేష్ పుట్టినరోజు కానుకగా చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానరులో నిర్మితమవుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇక ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాష్, ఎడిటర్‌గా నవీన్ నూలి, సినిమాటోగ్రాఫర్‌గా మాది, సంగీత దర్శకుడిగా తమన్ ఈ సినిమాకు సాంకేతిక నిపుణులుగా పనిచేయనున్నారు.

కాగా మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం ఇది. గతంలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. అతడు బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఖలేజా డీసెంట్ హిట్‌గా నిలిచింది. మరోవైపు మహేష్, పూజాహెగ్డే కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇది. గతంలో వీరిద్దరూ ‘మహర్షి’లో రొమాన్స్ చేశారు. కాగా దూకుడు, బిజినెస్ మేన్, ఆగడు, సర్కారు వారి పాట సినిమాల తర్వాత తమన్, మహేష్ కాంబోలో వస్తున్న చిత్రం ఇది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు.. పరుశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement