Friday, May 3, 2024

ఏపీ పాలిటిక్స్ ను టచ్ చేస్తున్న శ్రీరెడ్డి

శ్రీ రెడ్డి… కాంట్రవర్శీ కి కేరాఫ్ అడ్రస్. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఏపీ పాలిటిక్స్ ను మరోసారి టచ్ చేసింది శ్రీ రెడ్డి. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. సీఎం జగన్ ర్యాగింగ్ సిబిఎన్ అంటూ సాగే వాట్సాప్ స్టేటస్ వీడియోను పోస్ట్ చేసింది.

గతంలో కూడా శ్రీరెడ్డి ఏపీ రాజకీయాలపై పలుమార్లు మాట్లాతూ జగన్ కు తన మద్దతు ప్రకటించింది. ఇక మరో వైపు పవన్ కళ్యాణ్ పై కూడా నువ్వు రాజకీయాల్లో సీఎం కాలేవు అంటూ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. నీ క్రేజ్ ఎంత ఉన్నా అది సినిమాలు వరకే పరిమితం అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement