Thursday, May 16, 2024

చంద్రయాన్-3 విజయం కొసం దేశవ్యాప్తంగా పూజలు, హోమాలు, ప్రార్థనలు…

భారత ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. మరికొద్ది గంటల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నింగిలోకి పంపిన చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది.

ఈ క్రమంలో చంద్రయాన్-3 విజయవంతమవ్వాలని దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కులమతాలకు అతీతంగా భగవంతుడికి ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు.ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతంగా జరగాలని గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమార్థ్ నికేతన్ ఘాట్‌లో త్రివర్ణ జెండా చేతపట్టుకుని గంగా హారతి ఇచ్చారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి విశేషంగా భక్తులు తరలివచ్చారు.

.మరోవైపు.. ఒడిశాలోని పూరిలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. చంద్రయాన్-3కి తన కళతో ఆల్ ది బెస్ట్ తెలిపారు. పూరి సముద్ర తీరాన సుదర్శన్ బృందం.. భారీ సైకత శిల్పాన్ని రూపొందించింది. జయహో ఇస్రో అంటూ ఇసుకతో చెక్కింది. ఈ సైకత శిల్పం.. పర్యాటకలను విశేషంగా ఆకర్షిస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement