Saturday, May 18, 2024

Speaker – ఒకే ఒక్క నామినేషన్ – స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్న గడ్డం ప్రసాద్

హైదారాబాద్ – కొత్త శాస‌న‌స‌భ‌కు రేపు స్పీక‌ర్ ఎన్నిక జ‌ర‌గ‌నుంది.. ఈ క్ర‌మంలో నేడు నామినేష‌న్ ల‌ను స్వీక‌రించ‌నున్నారు.. కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధిగా వికారాబాద్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఎమ్మ‌ల్యే త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారు.. ఆయ‌న అభ్య‌ర్ధిత్వానికి బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది..

నేటి నామినేష‌న్ దాఖ‌లు కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్ర‌లు సీత‌క్క , పొంగులేటి ,తుమ్మ‌ల‌, బిఆర్ఎస్ నేత‌లు కెటిఆర్, హ‌రీష్ రావు, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు త‌దిత‌రులు పాల్గొ్న్నారు.. స్పీక‌ర్ ప‌ద‌వికి ఒకే ఒక్క నామినేష‌న దాఖ‌లు కావ‌డంత ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏక‌గ్రీవం కానుంది.. నేటి సాయంత్రం ఆయ‌న ఎన్నిక‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.
ఇక రేపు అసెంబ్లీలో ప్రొటెమ్ స్పీక‌ర్ అక్బ‌రుద్డిన్ ఒవైసీ కొత్త‌గా ఎన్నికైన స్పీక‌ర్ ప్ర‌సాద్ తో ప‌ద‌వీ ప్ర‌మాణం చేయించ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement