Sunday, April 28, 2024

తెలుగు రాష్ట్రాలలో నడిచే ఆరు ప్రత్యేక రైళ్లు రద్దు

ఏపీ, తెలంగాణలో నడిచే ఆరు ప్రత్యేక రైళ్లను రెండు వారాల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల నుంచి స్పందన లేక రైళ్లు బోసిపోతుండడంతో ద.మ.రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. రద్దు చేసిన రైళ్లలో విశాఖపట్టణం-కాచిగూడ, (08561) రైలును జూలై 1 నుంచి జులై 14వ తేదీ వరకు, కాచిగూడ-విశాఖపట్టణం (08562) రైలును జులై 2 నుంచి 15వ తేదీ వరకు, విశాఖపట్టణం-కడప (07488) రైలును రేపటి నుంచి 14వ తేదీ వరకు, కడప-విశాఖపట్టణం (07487) రైలును 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, విశాఖపట్టణం-లింగంపల్లి (02831) రైలును రేపటి నుంచి 14వ తేదీ వరకు, లింగంపల్లి-విశాఖపట్టణం (02832) రైలును 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement