Monday, April 29, 2024

ర‌క్తంతో సోనూసూద్ పెయింటింగ్-పిచ్చి ప‌నులు చేయొద్ద‌న్న న‌టుడు

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతో మందికి స‌హాయం చేసి రియ‌ల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్.
నటనతో పాటు సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సోను సూదికి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తాజాగా మధు గుర్జార్ అనే ఫ్యాన్ సోనూసూద్ పై తన అభిమానాన్ని ప్రత్యేక రీతిలో చాటుకున్నాడు. తన రక్తంతో సోనుసూద్ పెయింటింగ్ వేసి.. ఆ పెయింటింగ్ ని ఆయనకే బహుమతిగా ఇచ్చాడు. అభిమాని చేసిన పనికి రియల్ హీరో షాక్ అయ్యాడు. రక్తంతో తన బొమ్మను గీయడం కంటే.. తన పేరు చెప్పి రక్తదానం చేస్తే ఇంకా సంతోషించేవాడినని సోనూసూద్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను సోనుసూద్ ట్విట్టర్లో షేర్ చేస్తూ.. వృధా చేయకుండా దానం చేయాలని కోరారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. సోనూసూద్ చివరగా చాంద్ గా బార్దాయ్ అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement