Saturday, April 27, 2024

సోనియా గాంధీతో భేటీ అయిన మమతా బెనర్జీ..

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీ గా గడుపుతున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని జనపథ్‌లో సమావేశమయ్యారు. కేంద్రంలో బీజేపీని అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మూడవ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది..ఈ నేపథ్యంలో సోనియాతో భేటీ సందర్భంగా మమతా బెనర్జీ ఈ అంశంపై ప్రధానంగా చర్చించవచ్చని సమాచారం. ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సోనియా, రాహుల్‌తోపాటు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో సమావేశమై ఈ అంశంపై చర్చించిట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు చెందిన మరి కొందరు నేతలను కూడా మమతా బెనర్జీ కలవనున్నారు. ః

ఇది కూడా చదవండి: పేటీఎం లో 20 వేల ఉద్యోగాలు.. 35 వేల జీతం..

Advertisement

తాజా వార్తలు

Advertisement