Wednesday, May 15, 2024

చూడ‌టానికి రాలేద‌ని.. కొడుకును చెప్పుతో..

త‌ల్లీబిడ్డ‌ల ప్రేమ అజ‌రామ‌రం… మాతృ ప్రేమ అనిర్వ‌చ‌నీయం… త‌ల్లీబిడ్డ‌ల అనుబంధం గురించి ఎంత చెప్పినా త‌క్కువ అవుతుంది. బిడ్డ క‌న‌బ‌డ‌క‌పోతే ఆ త‌ల్లి ప‌డే బాధ వ‌ర్ణ‌ణాతీతం. అలాంటి త‌ల్లి అనుకోని ప‌రిస్థితుల్లో కొడుక్కు దూర‌మైంది. చాలా రోజుల పాటు కొడుకు వ‌స్తాడ‌ని ఎదురుచూసింది. త‌ట్టుకోలేక ఆ త‌ల్లి… త‌న కొడుకును చూడటానికి స్వ‌దేశానికి తిరిగొచ్చింంది. అమ్మ వ‌స్తోంది అంటూ… ఆ కొడుకు విమానాశ్ర‌యానికి ఆనందంతో ప‌రుగులు పెట్టివచ్చాడు.

అమ్మ విమానం దిగి వ‌స్తోంది. కొడుకు బొకే ప‌ట్టుకొని ప్ల‌కార్డుపై మిస్ యూ మ‌మ్మీ అంటూ రాసుకుని త‌ల్లికి ఎదురెళ్లాడు. దగ్గ‌ర‌కు వ‌చ్చిన కొడుకుని త‌న కాలు చెప్పు తీసుకుని విమానాశ్ర‌యంలో అంద‌రూ చూస్తుండ‌గానే కొడుకు చెంప‌ల‌పై ప‌టాప‌టాలాడించేసింది. ఆ వెంట‌నే కొడుకుని అక్కున చేర్చుకుని కంట‌నీరు పెట్టుకుంది. ఎందుకురా అమ్మ‌ను చూడ‌టానికి రాలేదంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. పాకిస్తాన్‌లో ఈ దృశ్యం ఆవిష్కృత‌మైన‌ట్లు ఆ మీడియో చేస్తే తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement