Monday, April 29, 2024

తాంత్రికురాలు చెప్పింద‌ని.. ఐదేళ్ల కొడుకును ఐదు ముక్క‌లుగా న‌రికేశాడు!

భోపాల్: ఓ వైపు ప్ర‌పంచం ఆధునిక వైపు అడుగులేస్తుంటే… స‌మాజంలో ఇంకా మూఢ‌న‌మ్మ‌కాలు పోవ‌ట్లేదు. తాంత్రికులు చెప్పిన మాట‌లు విని ఓ తండ్రి త‌న క‌న్న కొడుకును హ‌త‌మార్చాడు. గొడ్డ‌లితో ఐదు ముక్క‌లు చేసి గోతిలో పాతిపెట్టాడు. ఈఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అలీరాజ్‌పూర్‌లో చోటుచేసుకుంది. దినేష్ అనే వ్య‌క్తి వ్య‌వ‌సాయం చేస్తూ భార్య, ఇద్ద‌రు కూతుళ్లు, ఇద్ద‌రు కొడుకుల‌తో ప్ర‌శాంతంగా జీవ‌నం సాగిస్తున్నాడు. అత‌నికి మూఢ‌న‌మ్మ‌కాల‌పై మ‌క్కువ ఎక్కువ‌.

ఇటీవ‌ల అత‌ని ఐదేళ్ల చిన్న‌కొడుకు అనారోగ్యం బారిన ప‌డ్డాడు. కుమారుడిని ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌కుండా మ‌హిళా తాంత్రికురాలి వ‌ద్ద‌కు తీసుకెళ్లాడు. నీ కొడుక్కి దెయ్యం ప‌ట్టింద‌ని, అది పోవాలంటే బాలుడిని గొడ్డ‌లితో ఐదు ముక్క‌లుగా న‌రికి గోతిలో పాతిపెట్టాలని చెప్పింది. ఆ తాంత్రికురాలు చెప్పిన విధంగా దినేష్. త‌న కొడుకును గొడ్డ‌లితో న‌రికి చంపేసి, గోతిలో పాతిపెట్టాడు. ఈ విష‌యం ఇరుగుపొరుగు వారికి తెలిసి, పోలీసుల‌కు స‌మాచార‌మందించారు. దీంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. కేసు న‌మోదు చేసుకుని, నిందితుడిని అదుపులోకి పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement