Tuesday, May 21, 2024

ఆయన ‘చందాబాబు’.. ఈయన ‘ఏసుబాబు’

కేంద్ర పథకాలపై ఏపీ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటోందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. తాజాగా సోము వీర్రాజు ట్విట్టర్ ద్వారా మరోసారి ఈ అంశంపై స్పందించారు. అప్పట్లో చందాబాబు, ఇప్పుడు యేసు బాబు అంటూ విమర్శించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా కేంద్ర పథకాలను తమ పథకాలుగా చెప్పుకుందని పరోక్షంగా ప్రస్తావించారు. ఇప్పుడు ప్రధాని మోదీ పథకాలపై జగన్ ప్రభుత్వం సొంత స్టిక్కర్లు వేసుకుంటోందని ఆరోపించారు. ఈ మేరకు ఓ జాబితాను కూడా సోము వీర్రాజు తన ట్వీట్‌లో ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర పథకానికి ఏ పేరు పెట్టి అమలు చేస్తోందో వివరించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి పీఎం ఆవాస్ యోజన వరకు కేంద్ర పథకాలను రాష్ట్రం ఎలా తనవిగా చెప్పుకుంటోందో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement