Sunday, April 28, 2024

సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సోమేశ్‌ కుమార్‌

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది సోమేశ్‌ కుమార్‌కు అభినందనలు తెలిపారు. మాజీ ప్రధాన కార్యదర్శి అయిన సోమేశ్‌ కుమార్‌ను ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement