Friday, March 29, 2024

మనిషికైనా మొక్కకైనా మట్టే ప్రాణాధారం : ఎంపీ సంతోష్‌ కుమార్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మనిషికైనా, మొక్కకైనా మట్టే ప్రాణాధారం అని గ్రీన్‌ ఇండియా వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌ ప్రతినిధులు రాఘవ,ప్రసాద్‌, శైలజ తదితరులు ఎంపీ సంతోష్‌ కుమార్‌ను కలిసి సద్గురు ఆధ్వర్యంలో చేపట్టిన సేవ్‌ సాయిల్‌ ఉద్యమానికి మద్దతు ఇవ్వల్సిందిగా కోరారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఈశా ఫౌండేషన్‌ ఏర్పాటు చేయబోయే సేవ్‌ సాయిల్‌ కార్యక్రమానికి ఎంపీ సంతోష్‌ను వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈశా ఫౌండేషన్‌ చేపట్టిన సేవా కార్యక్రమాలను ఎంపీ సంతోష్‌కు వారు వివరించారు. సేవ్‌ సాయిల్‌ ఉద్యమంలో భాగంగా అన్ని రాష్ట్రాలలోని పర్యటనలు విజయవంతం అయ్యాయని, ప్రస్తుతం ప్రపంచ యాత్ర సాగుతోందని వారు తెలిపారు.

సేవ్‌ సాయిల్‌ ఉద్యమానికి సంపూర్ణ సహకారం అందజేస్తానని ఈశా ప్రతినిధులకు ఎంపీ సంతోష్‌ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పుడమి పచ్చదనం పెంచడమే లక్ష్యంగా హారా హైతో భరా హై అనే గొప్ప నినాదంతో 2018,జూలై17న తాము ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఉద్యమం నేడు హరిత కార్యక్రమాల్లో గొప్ప విప్లవంగా మారి అనుకున్న లక్ష్యాలను సాధించిందన్నారు. మట్టికి మొక్కకు అవినాభావ సంబంధం ఉన్నట్లే ఈశా ఫౌండేషన్‌ చేపట్టిన సేవ్‌ సాయిల్‌ ఉద్యమానికి, తాము చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఉద్యమానికి అదే సంబంధం ఉందన్నారు. మట్టిని కాపాడుకుని మొక్కను బతికించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement