Thursday, April 25, 2024

టార్గెట్ 2024: 26 జిల్లాలకు ఇన్‌చార్జిలు వీరే.. మంత్రులకు బాధ్య‌త‌లు అప్ప‌గించిన జ‌గ‌న్‌

ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు ప్రభుత్వం ఇన్‌చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి. తాము ఇన్‌చార్జిగా ఉండే జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను, పాలనపరమైన వ్యవహారాలను ఈ మంత్రులు పర్యవేక్షిస్తారు.

జిల్లాల వారీగా ఇన్‌చార్జి మంత్రుల వివరాలు:
► గుంటూరు: ధర్మాన ప్రసాదరావు
► కాకినాడ: సీదిరి అప్పల రాజు
► శీ​కాకుళం: బొత్స సత్యనారాయణ
► అనకాపల్లి: రాజన్న దొర
► ఏఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ పార్వతీపురం: గుడివాడ అమర్నాథ్‌
► విజయనగరం: బూడి ముత్యాల నాయుడు
► పశ్చిమ గోదావరి: దాటిశెట్టి రాజా
► ఏలూరు: పినిపె విశ్వరూప్‌
► తూర్పుగోదావరి: చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్‌
► ఎన్టీఆర్‌: తానేటి వనిత
► పల్నాడు: కారుమూరి వెంకట నాగేశ్వరరావు
► బాపట్ల: కొట్టు సత్యనారాయణ
► అమలాపురం: జోగి రమేష్‌
► ఒంగోలు: మేరుగ నాగార్జున
► విశాఖపట్నం: విడదల రజిని
► నెల్లూరు: అంబటి రాంబాబు
► కడప: ఆదిమూలపు సురేష్‌
► అన్నమయ్య: కాకాణి గోవర్థన్‌రెడ్డి
► అనంతపురం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
► కృష్ణా: ఆర్కే రోజా
► తిరుపతి: నారాయణ స్వామి
► నంద్యాల: అంజాద్‌ బాషా
► కర్నూలు: బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
► సత్యసాయి: గుమ్మనూరి జయరాం
► చిత్తూరు: కేవి ఉషాశ్రీ

Advertisement

తాజా వార్తలు

Advertisement