Monday, May 6, 2024

బిజెపి క్యాంపు కార్యాల‌యం ప్రాంగ‌ణంలోకి.. ప్ర‌వేశించిన పాము

బిజెపి క్యాంపు కార్యాల‌యం ప్రాంగ‌ణంలోకి ఓ పాము ప్ర‌వేశించింది. దాంతో అక్క‌డున్న జ‌నం ఒక్క‌సారిగా భయాందోళనకు గురయ్యారు. గమనించిన సిబ్బంది పామును పట్టుకుని సమీపంలోని చెట్ల పొదల్లోకి వదిలిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ఉత్కంఠంగా కొన‌సాగుతున్నాయి. కాగా అధికార బీజేపీ , ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. రెండు పార్టీలు ఇంచుమించు సమాన స్థానాలతో ముందంజలో ఉన్నాయి. దీంతో ఏ పార్టీ గెలుస్తుందో అన్న ఉత్కంఠ కర్ణాటక ప్రజల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా నెలకొంది.ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవ‌రాజు బొమ్మై వరుసగా నాలుగోసారి ఎన్నికల బరిలోకి దిగిన షిగ్గావ్‌ నియోజకవర్గంలో ఓ పాము ప్రవేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement