Wednesday, April 24, 2024

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కోటేశ్వర రావు అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.చీర్యాల గ్రామ శివారు సాయి నగర్ కాలనీ వెనుక భాగంలో నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని కోటేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. కోటేశ్వర రావు వృత్తిరీత్యా తాపీ మేస్త్రి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా గోగినేని వారిపాలెంకు చెందిన కోటేశ్వర రావు, స్థానికంగా ఆర్.ఎల్.నగర్ లో తన కుటుంబంతో గత కొద్ది సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు.

గత శనివారం సొంత ఊరికి వెళ్ళిన కోటేశ్వర రావు వారం రోజుల తరువాత శవమై కనిపించడంతో కోటేశ్వరరావు కుటుంబ సభ్యుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కోటేశ్వర రావు ఆత్మహత్యకు కారణం ఆర్థిక ఇబ్బందులేనని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement