Sunday, May 5, 2024

ఓటీటీలో కి వ‌చ్చేస్తున్న స్కంధ.. అనుకున్న స‌మ‌యానికి కంటే ముందుగానే !

రామ్ పోతినేని హీరోగా మాస్ ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ స్కంధ. సెప్టెంబర్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. కాగా, ఈ సినిమాలో రామ్‌ని ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌నంత మాస్‌గా చూపించాడు బోయ‌పాటి. ఇక ఈ సినిమాలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా న‌టించారు.

కాగా.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. ఈ మూవీ ఓటీటీ హ‌క్కుల‌కు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఇక‌, అక్టోబ‌ర్ 27 నుంచి డిస్నీ+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

స్కంద చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించాడు. బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతెలా స్పెషల్‌ సాంగ్‌లో క‌నిపించింది. ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీనివాస్‌ చిట్టూరి, పవన్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement