Friday, May 3, 2024

ఢిల్లీలో కన్నులపండువగా శ్రీరామ నవమి వేడుకలు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీతో పాటు పలు తెలుగు సంఘాలు శ్రీరాముల వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రా విద్యా సంస్థల 5 బ్రాంచుల్లో పండుగ సంబరాలు నిర్వహించారు. ఐటీవోలో ఈఐఎస్ పూర్వ అధ్యక్షులు ఎం.వి రామారావు, శశికుమార్ బృందంచే తొలుత విష్ణుసహస్ర నామ పారాయణం జరిగింది.

ఏఈఎస్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్, ఉపాధ్యక్షులు అలీషా, కో ఛైర్మన్ వి.వి.రావు, కోశాధికారి ఛటర్జీ, శివప్రసాద్, పాఠశాల ఉప ప్రధానోపాధ్యాయుడు ఉపేందర్ చేతుల మీదుగా దేవుడి ఊరేగింపు కార్యక్రమం జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో లోకకళ్యాణం కోసం సీతారాముల కళ్యాణం కన్నులపండువగా జరిగింది. అనంతరం మహాప్రసాద వితరణ జరిగింది. స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉత్తరాది వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement