Monday, April 29, 2024

నా వంతు షూట్ ముగిసింది.. సినిమాతో క‌లుద్దాం.. శృతిహాస‌న్

స‌లార్ మూవీ షూటింగ్ ని తాను కంప్లీట్ చేశాన‌ని తెలిపింది హీరోయిన్ శృతిహాస‌న్. ఈ చిత్రంలో హీరోగా ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు.
తాజాగా శృతిహాసన్ పోషించిన ‘ఆద్య’పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్టు పూర్తి అయ్యిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా మరో 30 రోజుల్లో డార్లింగ్ ప్రభాస్ కూడా షూటింగ్ పూర్తి చసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవిబర్రూసూర్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు శృతిహాసన్ కూడా దర్శకుడు, డీవోపీలతో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ తనవంతు పూర్తైందని పేర్కొంది. ఈ సందర్భంగా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ఇక నావంతు ‘సలార్’ ముగిసింది. నున్న మీఆద్యగా చేసినందుకు థాంక్యూ ప్రశాంత్ సార్.. మీరు అసాధారణమైనవారు.. ఇక అపూర్వమైన డార్లింగ్ ప్రభాస్ కి నా కృతజ్ఞతలు.. ఫొటోగ్రఫీ భువన చాలా దయగా, మీలా ఉండటం… హోంబలే ఫిల్మ్స్ టీమ్‌లోని అందరితో కలిసి ఈ ప్రత్యేకమైన చిత్రంలో పని చేయడం చాలా బాగుంది. చివరి వరకూ అందరినీ కుటుంబ సభ్యులలా భావించాను. అందరికీ చాలా కృతజ్ఞతలు. సినిమాతో కలుద్దాం అంటూ ఆసక్తికరంగా నోట్ రాసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement