Thursday, April 25, 2024

మంచిర్యాల కలెక్టరేట్ ను వెంటనే పూర్తి చేయండి .. బాల్క సుమన్

మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ సూచించారు. శుక్రవారం నస్పూర్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, మంచిర్యాల జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ లతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు పూర్తయితే జిల్లా ప్రజలకు ఒకేచోట కార్యాలయం అందుబాటులోకి వచ్చి మెరుగైన సేవలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement