Thursday, April 25, 2024

కేసీఆర్ పై వైఎస్ ష‌ర్మిల సెటైర్స్..ట్విట్ట‌ర్ లో పోస్ట్..

క‌న్న‌త‌ల్లికి అన్నం పెట్ట‌నోడు పిన‌త‌ల్లికి బంగారు గాజులు కొనిస్తాడ‌ట అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ ఆర్ టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల సెటైర్ వేసింది. ట్విట్ట‌ర్ లో ఓ పోస్ట్ ని పెట్టింది. బయటి రాష్ట్రం రైతులకు మూడు లక్షల రూపాయలు ఇస్తారా.. మన రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారికి , ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులకు, రైతులకు ఎన్ని లక్షలు ఇచ్చారు సార్..?తెలంగాణ ప్రజల ప్రాణాలకు విలువ లేదా.. కేసీఆర్ ను పరోక్షంగా వైఎస్ షర్మిళ విమ‌ర్శించారు. సొంత రాష్ట్రానికి దిక్కు లేదు కానీ ప‌క్క రాష్ట్రాల‌కు సాయమందిస్తాన‌న‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement