Thursday, May 2, 2024

Road Accident : ఘోర రోడ్డుప్రమాదం…ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం

రోడ్డుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన బిహార్‌ రోహతాస్‌లో చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శివసాగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పఖ్నారి సమీపంలో ఇవాళ ఉదయం రెండో నంబర్‌ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను స్కార్పియో ఢీకొట్టింది. దీంతో సంఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను వాహనంలో నుంచి తీసి పోస్టుమార్టానికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైవేపై ఆగి ఉన్న కంటైనర్‌ను స్కార్పియో వేగంగా వచ్చి ఢీకొట్టింది. సంఘటనా స్థలంలోనే ఏడుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనంలో మృతులు, క్షతగాత్రులు బోధ్‌ గయా నుంచి కైమూర్‌ జిల్లా కుడారి గ్రామానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement